Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పరారీలో వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు
posted on: Apr 22, 2026 9:08AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారీలో ఉన్నారు. తన మాజీ డ్రైవర్, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై కొత్తగా కేసు నమోదైంది. ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి కాకినాడలోని ఆయన నివాసానికి పోలీసులు చేరుకోగా, అప్పటికే ఆయన పరారయ్యారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారనీ.. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తమకు డబ్బు ఆశ చూపి, ప్రాణహాని తలపెడతామని బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న అనంతబాబు అనుచరుడు మాగంటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2022లో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేయడంతో.. ఆయన బయట ఉన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ఆయన్ను గతంలోనే హెచ్చరించింది. ఈ నెల 24, 25 తేదీల్లో ఈ హత్య కేసులో అభియోగాల నమోదు జరగాల్సి ఉండగా, అంతకు ముందే అనంతబాబు సాక్షులను బెదరించారన్న ఆరోపణలతో ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మంగళవారం (ఏప్రిల్ 21) పోలీసులు ఆయన నివాసానికి వెళ్లిన సమయంలో ఆయన గన్ మన్ అక్కడే ఉన్నారు. కారు కూడా ఇంటివద్దే ఉంది. ఆయన మోటార్ సైకిల్ పై పరారైనట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పరారీ వార్త ప్రస్తుతం






