11 - 11 -11.. ఒక్క రోజు బాగోతమేనా?

posted on: Feb 12, 2026 9:00AM

వైసీపీ వ్రతమూ చెడింది.. ఫలమూ దక్కలేదు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు గురువారం(ఫిబ్రవరి 12) వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలకు జగన్ 11 టీమ్ హాజరౌతుందని వైసీపీ ఆర్భాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన మేరకు వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది బుధవారం (ఫిబ్రవరి 11) సభకు హాజరయ్యారు. సరిగ్గా పద కొడు నిముషాలు సభలో ఉండి.. నినాదాలు చేసి వాకౌట్ చేశారు. దీంతో టీమ్ 11 అసెంబ్లీ హాజరు కేవలం అటెండెన్స్ కోసమే అన్న విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆ విమర్శలు వాస్తవం కాదని చెప్పడానికైనా జగన్ అండ్ కో అంటే ఆయన, ఆయనతో పాటు 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలూ కనీసం 11 నిముషాల సేపు సభలో ఉండేలాగైనా సమావేశాలకు హాజరౌతారని భావించారు. అయితే  వైసీపీకి విమర్శలు పట్టించుకునే అలవాటు లేదనీ, వారు సభకు వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమేననీ పరిశీలకులు విశ్లేషించారు. ఆ విశ్లేషణలకు అనుగుణంగానే వైసీపీ ఎమ్మెల్యేలు గురువారం (ఫిబ్రవరి 12) సభకు గైర్హాజరయ్యారు. 

ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ రోజు సభా హాజరు లెక్కలోకి రాదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వారు బుధవారం (ఫిబ్రవరి 11) సభకు వచ్చినా అది హాజరు కిందకు రాదు. ఇక గురువారం (ఫిబ్రవరి 12) నుంచి హాజరు లెక్కలోకి వస్తుంది. అయితే టీమ్ 11 సభకు హాజరు కాలేదు. మార్చి 7 వరకూ జరిగే ఈ సెషన్ కు ఇక వైసీపీ ఎమ్మెల్యేల హాజరు ఉండదని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ వర్గాల నుంచీ అదే వినిపిస్తోంది. ఈ సారి బడ్జెట్ సమావేశాలు మార్చి 7 వరకూ దాదాపు 17 రోజుల పాటు సాగనున్నాయి. ఈ సెషన్ మొత్తానికి గైర్హాజరైతే.. 60 రోజుల గైర్హాజర్ కంప్లీట్ అవుతుంది.. శాసనసభ్యత్వం రద్దౌతుందని అంటున్నారు. గతంలోలా దొంగ చాటుగా రిజిస్టర్ లో సంతకం చేసేసి వెళ్లిపోయే అవకాశం లేకుండా డిజిటల్ హాజరు విధానం అమలులోకి వచ్చింది. దీంతో జగన్ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కని పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.  

అలా కాకుండా ఒక వేళ.. బుధవారం (ఫిబ్రవరి 11) వైసీపీయులు సభకు హాజరు కావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే.. మళ్లీ 60 పని దినాల వరకూ సభకు హాజరు కాకపోయినా వారిపై అనర్హత వేటు పడే అవకాశం లేదు. కానీ ఇక్కడ వైసీపీ తమ సభా బహిష్కరణకు చెప్పుకోవడానికి కారణం ఉండదు. ఎందుకంటే..  ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని జగన్ చేసిన శపథంపై ఆయన నిలబడలేదు. దీంతో ఇక వారి సభా బహిష్కరణ.. పలాయనం కిందకే వస్తుందని పరిశీలకులు అంటున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...