మా ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటా.. ప్రధానికి పవన్ కల్యాణ్ సతీమణి ప్రామిస్

posted on: May 11, 2026 12:38PM

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి నిన్న వెళ్లిన సంగతి తెలిసిందే.  ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ ను ఆయన పరామర్శించి,  ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పవన్ కల్యాణ్ కుటుంబంతో కొద్ది సేపు భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

కాగా ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.  ఇక పోతే  ప్రధాని మోడీ కూడా పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాననీ, . ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాననీ పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  అలాగే  పవన్ కల్యాణ్ కూడా ప్రధాని వ్యక్తిగతంగా తమ ఇంటికి  వచ్చి మరీ తనను పరామర్శించడంపై కృతజ్ఞతలు తెలిపారు.   ప్రధాని తమ కుటుంబంతో గడిపిన  విలువైన సమయం జీవితాంతం గుర్తుండిపోతుందంటూ ట్వీట్ చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...