Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ కలయిక సంకేతమేంటి?
posted on: Feb 9, 2026 8:07AM

రాజకీయాలలో సంచలనంగా చెప్పదగిన అరుదైన కలయిక చెన్నైలో జరిగింది. రాజకీయ సినీ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులు చెన్నైలోని ఓ వివాహవేడుకలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, అలాగే ఇటీవలే సినీ రంగం నుంచి రాజకీయాలలోకి ప్రవేశించిన టీవీకే అధినేత దళపతి విజయ్ లు ఆదివారం (ఫిబ్రవరి 8) చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు.
ముగ్గురూ ఓకే చోట కనిపించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ అధినేత జగన్ సమీప బంధువు అయిన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి వివాహం చెన్నైలో జరిగింది. ఈ వివాహవేడుకకు సహజంగానే ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్, టీవీకే అధినేత దళపతి విజయ్ కూడా హాజరయ్యారు. ఒకే కార్యక్రమంలో ఈ ముగ్గురూ కనిపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతే కాకుండా వైఎస్ జగన్, దళపతి విజయ్ లు పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.


.webp)
.webp)


