అంతకంతకూ పెరుగుతున్న నీటిమట్టం!
posted on: Sep 2, 2024 1:02PM

కృష్ణా నది వరద గంటగంటకూ పెరుగుతోంది. 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద వరద. 1903లో, 2009లో వరద నీరు పది లక్షల క్యూసెక్కులు దాటాయి. ఇప్పుడు ఏకంగా 11 లక్షల క్యుసెక్కులు దాటేసింది. ఇంకో 30, 40 వేల క్యూసెక్కుల వరద నీరు అదనంగా వస్తే ప్రకాశం బ్యారేజ్పై నుంచి వరద నీరు వెళుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 11.38 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద 24.3 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది.



.webp)



