ఘనంగా విశాఖలో నౌకాదళ విన్యాసాలు..

posted on: Feb 5, 2016 1:25PM

విశాఖ పట్నం సాగరతీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఘనంగా ప్రారంభమైంది. ఈసందర్బంగా వారు చేసే విన్యాసాలను వీక్షించడానికి సందర్శకులు వేల సంఖ్యలో హాజరవుతున్నారు. యుద్ధనౌకల నమూనాలతో కూడిన శకటాలు.. సముద్రంలో విద్యుద్ధీపాలతో అలంకరించిన యుద్ధనౌకలు ప్రజలను మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన, భారతీయ నౌకా దళానికి సంబంధించిన నౌకలు, జలంతర్గాములు, విమానాలు, హెలికాఫ్టర్ల విన్యాస ప్రదర్శన అలరించనున్నది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ రేపు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...