Latest News
వివేకా హత్య కేసు...విచారణ వాయిదా!
posted on: Mar 16, 2026 9:59PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసు కుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈరోజు సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా కేసుకు సంబం ధించిన అన్ని పత్రాలు, వివరాలను నిందితులకు అందజేశామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలియజేశారు.ఈ సందర్భంగా కేసు వివరాలు తమ కు అందినట్లుగా అఫిడవిట్ దాఖలు చేయాలని నిందితుల తరుపు న్యాయవాదు లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే సీబీఐ అందజేసిన కేసు పత్రాలను పూర్తిగా పరిశీలించేందుకు కొంత సమయం అవసర మని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. నిందితుల అభ్యర్థ నను పరిగణలోకి తీసుకున్న సీబీఐ కోర్టు ఈ నెల 19వ తేదీ లోపు కేసు వివరాలు అందినట్లు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను గురువారం వరకు వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత పొందిన నేపథ్యంలో ఈ కేసు విచా రణపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.






