ట్రెండ్‌ ఫాలో అవ్వను...సెట్‌ చేస్తా...విజయ్

posted on: May 12, 2026 5:09PM

 

విజయ్‌కు సోషల్ మీడియాలో పెరిగిన ఫాలోవర్స్..

24 గంటల్లోనే 4 లక్షల నుంచి 21 లక్షల ఫాలోవర్స్‌..
 

నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్‌, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న తర్వాత అదే క్రేజ్‌ రాజకీయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తమిళనాడు ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోవర్స్‌ భారీగా పెరగడం ఇప్పుడు తాజాగా చర్చనీయాంశంగా మారింది. సీఎంగా బాధ్య తలు చేపట్టిన తర్వాత సీఎంవో తమిళనాడు సోషల్ మీడియా పేజీలకు ఎవ్వరు ఊహించినంత స్పందన వచ్చింది. గతంలో ఈ పేజీలకు పరిమిత స్థాయి లోనే ఫాలోయింగ్‌ ఉండగా, ఇప్పుడు లక్షల సంఖ్యలో ప్రజలు చేరడం గమనార్హం.

ఇన్‌స్టాగ్రామ్‌లో గతంలో సీఎంవో తమిళనాడు పేజీకి సుమారు 4 లక్షల మంది మాత్రమే ఫాలోవర్లు ఉండేవారు. అయితే విజయ్‌ సీఎం అయిన తర్వాత ఒక్కసారిగా ఫాలోయింగ్‌ పెరిగి 15 లక్షలకు చేరింది. అదే విధంగా ‘X’ (ట్విట్టర్‌) ఖాతా పరిస్థితి కూడా మారిపో యింది. గతంలో 4 లక్షల ఫాలోవర్లు ఉన్న ఈ ఖాతా, ఇప్పుడు 21 లక్షల ఫాలోవర్ల ను దాటింది.ఇంకా మరో విశేషం ఏమిటంటే, విజయ్‌ సీఎం కుర్చీలో కూర్చున్న ఫోటోను డీపీగా మార్చిన తర్వాత 24 గంటల్లోనే 14 లక్షల మంది వీక్షించడం భారీ స్పందనగా చెప్పుకో వాలి.మొత్తానికి, సినిమా నుంచి రాజకీయాలకు వచ్చిన విజయ్‌ — ట్రెండ్‌ ఫాలో అవ్వకుండా, ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...