Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇరాన్ పై అమెరికా వైమానిక దాడి.. ఇండియా రావాల్సిన విమానం ధ్వంసం
posted on: Mar 31, 2026 9:15AM
.webp)
ఇరాన్ పై అమెరికా దాడిలో భారత విమానం ధ్వంసమైంది. ఈ ఘటన ఇరాన్ లోని మషద్ విమానాశ్రయంలో సోమవారం (మార్చి 30) జరిగింది. ఈ విమానం భారత్ నుంచి మానవతా సాయంగా అందాల్సిన వైద్య సామగ్రిని తీసుకువెళ్లే విమానం కావడం గమనార్హం. ఇరాన్ పై అమెరికా వైమానిక దాడిలో మహాన్ ఎయిర్ సంస్థకు చెందిన ఈ విమానం ధ్వంసమైంది. ఈ విమానం వచ్చే నెల 1న ఇండియాకు చేరుకుని ఇక్కడ నుంచి ఇరాన్ ప్రజలకు అవసరమైన అత్యవసర వైద్య సమగ్రి, ఇతర ఔషధాలను రవాణా చేయాల్సి ఉంది.
అయితే మషద్ విమానాశ్రయంపై జరిగిన ఈ దాడిలో విమానం దెబ్బతినడంతో భారత్ నుంచి సహాయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ దాడితో తమ మిషన్కు తీవ్ర ఆటంకం ఏర్పడిందని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికే మార్చి 18న తొలి విడత వైద్య సహాయాన్ని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ ద్వారా భారత్ ఇరాన్కు పంపింది.
ఈ సహాయం పట్ల న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం భారత ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. మహాన్ ఎయిర్ అనేది పశ్చిమాసియా, మధ్య ఆసియా, దక్షిణాసియాలో సేవలు అందిస్తున్న ఒక ప్రైవేట్ విమానయాన సంస్థ. అదలా ఉండగా ఈ వైమానిక దాడిని అమెరికా ధ్రువీకరించలేదు.






