Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో ప్రతి పౌరుడికి యూనివర్సల్ హెల్త్ పాలసీ : సీఎం చంద్రబాబు
posted on: Mar 4, 2026 5:42PM
.webp)
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం దృఢసంకల్పంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో స్పష్టం చేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ, ఉద్యోగాల కల్పన, వైద్య, విద్య తదితర రంగాలపై సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వివరించారు.
విద్యా రంగంలో మెరుగైన ఫలితాల కోసం పేరెంట్–టీచర్ మీటింగ్ల ద్వారా పాఠశాలల పనితీరును సమీక్షిస్తున్నామని తెలిపారు. గత పాలనలో విద్యా వ్యవస్థ దిగజారిపోయిందని విమర్శించిన ఆయన, ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని స్పష్టం చేశారు. ఇంగ్లీష్ పేరుతో విద్యార్థులను గందరగోళానికి గురిచేసే విధానాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగును కాపాడుతూ ప్రపంచానికి ప్రతిభావంతులైన యువతను అందించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు.
ఆరోగ్య రంగంలో దేశంలోనే తొలిసారి ప్రతి పౌరుడికి వర్తించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువస్తున్నామని సీఎం వెల్లడించారు. ఈ విధానం ద్వారా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నట్టు తెలిపారు. అతి తక్కువ వ్యయంతో నాణ్యమైన చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు.
పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణం చేపడుతున్నామని, పీపీపీ అంటే ప్రైవేటు కాదని స్పష్టం చేశారు. అవి పూర్తిగా ప్రభుత్వ ఆస్తులుగానే ఉంటాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సేవలు అందుతాయని తెలిపారు. గత పాలకులు మెడికల్ కళాశాలలకు భూమి కూడా చూపించలేదని విమర్శించారు.సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
పెట్టుబడుల విషయానికొస్తే 2019-24 మధ్య రాష్ట్ర బ్రాండ్ దెబ్బతిందని, జాకీ, అమర్ రాజా, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు రాష్ట్రాన్ని విడిచిపోయాయని తెలిపారు. పూర్తిగా నెగెటివ్ ఇమేజ్ సృష్టించడంతో పెట్టుబడులు తగ్గిపోయాయని విమర్శించారు. 2019 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 913 కంపెనీలు మూతపడినట్టు ఆర్బీఐ నివేదికలో పేర్కొన్నట్టు సభకు తెలిపారు. రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు రప్పించి, ఐటీ మరియు పరిశ్రమల రంగాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.






