నిర్మలమ్మ పద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
posted on: Feb 1, 2026 8:56AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి కొద్ది సేపటిలో లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆ సందర్భంగా ఆమె తన నివాసంలో పూజలు నిర్వహించి బడ్జెట్ ప్రతిపాదనలుఉన్న బ్యాగ్ తో తన నార్త్ బ్లాక్ కార్యాలయానికి చేరుకున్నారు.
అక్కడ నుంచి ఆర్థిక శాఖ సహాయ మంత్రులు భగవత్ కరద్, పంకజ్ చౌదరి, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బడ్జెట్ కాపీలను అందజేశారు. ఆ తరువాత యమర్యాదపూరకంగా కలుసుకున్నారు. బడ్జెట్ కాపీలను అందజేశారు. అక్కడ నుంచి పార్లమెంట్ భవనంలో కేబినెట్ భేటీకి హాజరయ్యారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.






