Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇంటర్ పరీక్షకు వెళ్తూ ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
posted on: Mar 12, 2026 11:40AM
.webp)
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు లారీ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కొత్తూరు మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండల కేంద్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు గురువారం ఉదయం ఇంటర్ పరీక్ష రాయడానికి శంషాబాద్లోని ఒక ప్రైవేట్ కాలేజీకి బైక్పై బయలుదేరారు. పరీక్షకు సమయానికి చేరుకోవాలనే ఉద్దేశంతో వారు వేగంగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పెద్ద షాపూర్ వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న లారీ వారి బైక్ను బలంగా ఢీకొట్టింది. లారీ ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగు లో పడి ఉన్న విద్యార్థులను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి కారణమైన లారీ మరియు డ్రైవర్ వివరాలను సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటర్ పరీక్ష రాయడానికి ఆశలతో బయలుదేరిన ఇద్దరు విద్యార్థులు ఇలా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలిసిన వెంటనే విద్యార్థుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో కొత్తూరు మండలంలో విషాద వాతావరణం నెలకొంది.


.webp)



