Latest News
11నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు
posted on: Mar 7, 2026 1:40PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 11 నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 11, 12 తేదీలలో కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తెలిపారు.
ఈ మేరకు అన్ని జిల్లాల కెక్టర్లకు మెమో జారీ చేశారు. రాజధాని అమరావతి సచివాలయంలో నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్సుకు అవసరమైన సమాచారంతో అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సు జరిగే రెండు రోజులూ ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
................................................



.webp)


