Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇరాన్పై యుద్ధానికి ముగ్గురు అధ్యక్షులు ‘నో’... ట్రంప్ మాత్రం ‘ఓకే’
posted on: Apr 23, 2026 5:21PM

ఇరాన్పై యుద్దంపై జాన్ కెర్రీ సంచలన విషయాలు
యుద్దానికి ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాది
యూఎస్ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సంచలన విషయాలు
ఇరాన్పై అగ్రదేశం అమెరికాతో కలిసి దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెనత్యాహూ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఆయన ప్రతిపాదనను గతంలో ముగ్గురు అమెరికా అధ్యక్షుడు తిరస్కరిస్తే.. ట్రంప్ మాత్రం ఓకే చెప్పి ప్రస్తుత యుద్దానికి కారణమయ్యారని అగ్రరాజ్య విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జాన్ కెర్రీ వెల్లడించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం దశాబ్దాలుగా ఉంది. ఇరాన్పై యుద్ధం చేయాలనే ప్రతిపాదనను నెతన్యాహు ఇంతకు ముందు కూడా అమెరికా అధ్యక్షుల ముందు పలుసార్లు పెట్టారని జాన్ కెర్రీ వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, బుష్, బైడెన్ తిరస్కరించారని తెలిపారు. జాన్ కెర్రీ ఒక టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒబామా వద్దన్నారు. బుష్ వద్దన్నారు. అధ్యక్షుడు బైడెన్ వద్దన్నారు. తాను కూడా ఆ చర్చల్లో ఉన్నానని చెప్పారు. నెతన్యాహు చాలా కాలంగా ఇరాన్పై దాడి చేయాలని అమెరికాను ఒత్తిడి చేస్తున్నారని కెర్రీ చెప్పారు.
కానీ గత అధ్యక్షులు దౌత్యపరమైన పరిష్కారాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని తెలిపారు. ట్రంప్ మాత్రం నెతన్యాహు మాటలు విని యుద్ధానికి దిగారని అన్నారు. వియత్నాం, ఇరాక్ యుద్ధాలు రెండూ ఒకే పాఠాన్ని నేర్పుతున్నాయని, వియత్నాం యుద్ధ వీరుడిగా తనకు ఆ పాఠం తెలుసని కెర్రీ పేర్కొన్నారు. 'వియత్నాం యుద్ధంలో పాల్గొన్న ఒక అనుభవజ్ఞుడిగా చెబుతున్నాను. దేని గురించి ఆ యుద్ధం చేయాలో మాకు చెప్పలేదు. పూర్తిగా అబద్ధాలు చెప్పారు. ముందు అమెరికా ప్రజలకు అబద్ధాలు చెప్పి.. ఆ తర్వాత వారి కొడుకులను, కూతుళ్లను యుద్ధానికి పంపమని అడగవద్దు' అని కెర్రీ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడి చేసేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నెతన్యాహు ఎలా ఒప్పించారో న్యూయార్క్ టైమ్స్ వివరించింది . 'ఫిబ్రవరి 11న సిట్యుయేషన్ రూమ్లో, నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్లో పాలన మార్పునకు సమయం ఆసన్నమైందని అన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్కు అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త మిషన్ ముగింపు పలకగలదని నెతన్యాహు గట్టిగా వాదించారు' అని ఆ నివేదిక పేర్కొంది. 'ఇది మంచి ఆలోచనగానే అనిపిస్తోంది' అంటూ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్కు ట్రంప్ పచ్చజెండా ఊపారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.



.webp)


