Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కల్వకుంట్ల కవితకి పాకిస్థాన్లో ఫుల్ పబ్లిసిటీ!
posted on: Jul 25, 2014 3:09PM

టీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితకు పాకిస్థాన్లో పూర్తి పబ్లిసిటీ వచ్చేసింది. కాశ్మీ్ర్ని, హైదరాబాద్ని భారతదేశంలో దౌర్జన్యంగా కలిపారని, కాశ్మీర్ని ఇండియా వదుకుంటే మంచిదని కల్వకుంట్ల చేసిన వేర్పాటువాద పూరిత వ్యాఖ్యలకు పాకిస్థాన్ మీడియా చాలా గొప్పగా ప్రచారం చేస్తోంది. కవిత ఆ వ్యాఖ్యలు చేసిన మర్నాడు పాకిస్థాన్లోని అన్ని వార్తాపత్రికలలో ఈ వార్త చాలా ప్రధానంగా వచ్చింది. కాశ్మీర్ ఇండియాలో భాగం కాదని పాకిస్థాన్ ఎప్పటి నుంచో చేస్తున్న వాదనకు ఇండియాలోని ఒక పార్లమెంటు సభ్యురాలే మద్దతు ఇస్తోందని పాకిస్థాన్ పత్రికలు తమ కథనాలలో రాశాయి. ఇండియాలో పార్లమెంటు సభ్యురాలే కాశ్మీర్ భారతదేశానికి చెందినది కాదు అంటోంది కాబట్టి కాశ్మీర్ పాకిస్థాన్దే అని పాకిస్థాన్ మీడియా భాష్యం చెప్పేసింది. కొన్ని పత్రికలు అయితే కవితని పొగడ్తలతో ముంచెత్తాయి. ఇప్పుడు పాకిస్థాన్లో కవితకి అభిమానులు బాగా పెరిగిపోయారు. కవిత పేరు చెబితే చాలు పాకిస్థానీలు పులకరించిపోవడం ఖాయం. కవితని చూస్తే పాకిస్థానీయులు తమ సొంత మనిషిని చూసినట్టు చూడక మానరు. భారతదేశంలో ఎంపీ స్థానంలో వుండి కూడా భారతదేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా, పాకిస్థాన్కి అనుకూలంగా మాట్లాడిన కవిత అంటే ఇష్టపడని పాకిస్థానీయులు ఎవరైనా వుంటారా? పాకిస్థాన్ నుంచి ఇంత అభిమాన్ని పొందుతున్న కవితకి అక్కడి ప్రభుత్వం పౌరసత్వాన్ని ఆఫర్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆగ్రహంతో కూడిన కామెంట్లు భారతీయులు చేస్తున్నారు.



.jpg)


