నారా లోకేష్‌పై దాడి : టీఆర్ఎస్ వాళ్ళకి మెంటలెక్కిందా?

 

టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి హోల్‌సేల్‌గా మెంటలెక్కిందా అనే సందేహాన్ని ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ అనే తేడాలేకుండా అన్ని ప్రాంతాల వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్‌లో కేసీఆర్ దగ్గర్నించి గల్లీలో వుండే ఛోటా లీడర్ వరకు మెంటలెక్కినట్టు అందరూ విచిత్రంగా బిహేవ్ చేయడం చూసి జనం ఈ నిర్ణయానికి వచ్చారు. గతంలో వేసిన మెంటల్ వేషాల సంగతి అలా వుంచితే, తాజాగా నారా లోకేష్ తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తుంటే ఆయన మీద మద్యం సీసాలు, మామిడికాయలతో దాడిచేయడం మెంటల్ పని కాక మరేమిటని జనం ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్‌కి తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం లేకపోతే, ఆ పార్టీ అధికారంలోకి రావడం నచ్చకపోతే ఆ విషయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప ఇలా భౌతిక దాడులకు పాల్పడటం న్యాయం కాదని తెలంగాణ ప్రజలే అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రావడం కోసం కృషి చేసిన ఒకపార్టీగా టీఆర్ఎస్ మీద వున్న గౌరవం ఇలాంటి సంఘటనల వల్ల మెల్లమెల్లగా తగ్గిపోతోందని వారు అంటున్నారు. నారా లోకేష్ మీద మాత్రమే కాకుండా హైదరాబాద్‌లో తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్న మాజీ మంత్రి దానం నాగేందర్ మీద కూడా తెరాస కార్యకర్తలు దాడి చేశారు. ప్రచార కార్యక్రమంలో గందరగోళం సృష్టించారు. ఈ ఎన్నికల తర్వాత అధికారంలోకి రావడం అసంభవమని తెరాసకి అర్థమైపోయింది. ఎవర్ని ఎన్నిరకాలుగా తిట్టినా తెలంగాణ ప్రజలు తెరాసను నమ్మడం లేదు. ఆ డిప్రెషన్‌లో టీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.