మళ్లీ కస్టడీకి ట్రైనీ ఐపీఎస్‌.. విచారణలో నోరు మెదపని ఉదయ్ కృష్ణారెడ్డి..!

posted on: Aug 7, 2026 8:16PM

 

హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసినా.. కేసుకు సంబంధించిన పలు కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానాలు ఇవ్వలేదని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయనను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని అత్తాపూర్ పోలీసులు నిర్ణయించారు. కస్టడీలో భాగంగా పోలీసులు అడిగిన అనేక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణా రెడ్డి సమాధానం చెప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం. ముఖ్యంగా కేసులో కీలకంగా మారిన ఐఫోన్ ఆచూకీ, కత్తి, మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో పరిచయం తదితర అంశాలపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

అయితే విచారణలో ఆశించిన స్థాయిలో సమాచారం రాకపోవడం తో.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరోసారి కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రేపు ఉప్పరపల్లి కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు నిర్ణయం అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి పోలీసుల కస్టడీకి అప్పగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల పోలీస్ కస్టడీ పూర్తయిన అనంతరం ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన సమయంలో ఆయన సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాతపూర్వక ఫిర్యాదు అందించినట్లు తెలుస్తోంది.

Trainee IPS Uday Krishna Reddy, CP Sajjanar Encounter Threats, Upparapally Court Show Cause Notice, SVPNPA Trainee IPS Controversy, Telangana Police Legal News 

google-ad-img
    Related Sigment News
    • Loading...