ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కొత్త ట్విస్ట్...!

posted on: Jul 21, 2026 10:49AM

 

ఆమెతో ఏడాది నుంచి రిలేషన్‌లో ఉన్న..సూసైడ్‌ నోట్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి..!

ట్రైనీ ఐపీఎస్  ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారంలో కీలక పరిణామాలు చోటుచేసు కున్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం ఉదయ్ అసలు ఆత్మహత్యాయత్నమే చేయలేదని  నిర్ధారణకు వచ్చినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రారంభంలో విషపూరిత ద్రవపదార్థం సేవించి ఆత్మహత్యకు యత్నించారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ఆధారాలు ఏవీ లభించలేదని సమాచారం. వైద్య పరీక్షల నివేదికల్లో ఆయన శరీరంలో విషపూరిత రసాయనాలు లేదా ఆత్మహత్యకు ఉపయోగించే పదార్థాల ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు.

దర్యాప్తులో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఉదయ్ కృష్ణా రెడ్డి అతిగా మద్యం సేవించడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అదే కారణంగా ఆయనకు అస్వస్థత ఏర్పడగా, వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన సూసైడ్ నోట్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 

ఆ నోట్ నిజంగా ఉదయ్ కృష్ణా రెడ్డి రాసిందా? లేక మరెవరైనా సృష్టించారా? అది ఎప్పుడు రాయబడింది? అనే అంశాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే చేతిరాత నిపుణులతో కూడా పరీక్షలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. పోలీస్ వర్గాల ప్రకారం, ఆత్మహత్యాయత్నం జరిగిందనే ప్రచారం వాస్తవాలకు భిన్నంగా ఉండొచ్చని అనుమానిస్తు న్నారు. సానుభూతి పొందేందుకు లేదా ఇతర కారణాలతో ఈ ప్రచారం జరిగి ఉండొచ్చనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. 

ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆ సమయంలో ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులు, ఫోన్ కాల్స్, డిజిటల్ ఆధారాలు, ఇతర పరిస్థి తులన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంపై తుది నిర్ధారణకు రావాలంటే ఫోరెన్సిక్ నివేదికలు, సూసైడ్ నోట్‌పై విశ్లేషణ, ఇతర సాంకేతిక ఆధారాలన్నీ అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మాత్రమే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ లేఖలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన లేఖలో, తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణితో తాను ఏడాది పాటు రిలేషన్‌లో ఉన్నానని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నాడు.

ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత కూడా తిరిగి తన వద్దకు వచ్చిందని, అనంతరం తమ మధ్య మళ్లీ సంబంధం కొనసాగిందని లేఖలో రాశాడు. ఈ విషయాలకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు. అలాగే, తన మరణానికి నలుగురు వ్యక్తులు కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదులో ఏముంది?

తనతో పాటు శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 23 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపుతూ దూషిస్తున్నాడని, రహస్యంగా తన వ్యక్తిగత ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి వాటితో బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, ఆ వీడియోలను తన భర్తకు పంపి మానసికంగా వేధించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించింది.

Trainee IPS Uday Krishna Reddy, Suicide note, Attapur Police Station, National Police Academy Hyderabad, Trainee IPS Suicide Attempt Drama, Hyderabad Police Investigation
 

google-ad-img
    Related Sigment News
    • Loading...