మరో మైలు రాయిని చేరుకున్న తెలుగువన్

posted on: May 29, 2026 2:44PM

తెలుగు డిజిటల్ మీడియా రంగంలో  దూసుకుపోతున్న తెలుగువన్  మరో మైలు రాయిని చేరుకుంది.  నిరంతరం  విశ్వసనీయమైన వార్తలను అందిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న  తెలుగువన్ న్యూస్ (tone news) తాజాగా 1 మిలియన్ సబ్‌స్క్రైబర్ల క్లబ్‌లో చేరింది. టెక్నాలజీ, రాజకీయాలు, వినోదం సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు   అప్‌డేట్స్ అందిస్తూ  తెలుగువన్  డిజిటల్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

 ఈ అద్భుత  విజయంపై  తెలుగువన్  మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ సంతోషం వ్యక్తం చేశారు. తమను నిరంతరం ఆదరిస్తూ, నమ్మకమైన ఛానెల్‌గా నిలబెట్టినందుకు కోట్లాది మంది తెలుగు వీక్షకులకు ఆయన  ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. '1 మిలియన్ స్ట్రాంగ్  అనే నినాదంతో ఛానెల్ మున్ముందు మరిన్ని నాణ్యమైన కార్యక్రమాలతో  ముందకు సాగుతుందన్నారు. సంచలనాల కోసం కాకుండా, వాస్తవాలను చేరవేయడమే ధ్యేయంగా పెట్టుకోవడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు.

 10 లక్షల సబ్‌స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నప్పటికీ.. సబ్‌స్క్రైబర్ల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉందని, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టిస్తామని చెప్పారు.  మిలియన్ సబ్ స్క్రిప్షిన్స్ మైలు రాయిని చేరుకున్న సందర్భంగా  సామాజిక మాధ్యమం వేదికగా  ఎండీ రవిశంకర్ , తెలుగువన్ న్యూస్, బృందానికి  అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...