Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుపతిలో మళ్లీ వేయి కాళ్ల మండపం!
posted on: Feb 27, 2016 10:58AM
.jpg)
తిరుపతిలోని వేయి కాళ్ల మండపాన్ని పునర్నింమించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లను ఆహ్వానించింది. తిరుమల మాడవీధులను వెడల్పు చేసేందుకుగాను, శ్రీవారి ఆలయం వెలుపల ఉండే అతిపురాతనమైన ఈ వేయి కాళ్ల మండపాన్ని ఒకప్పుడు కూల్చివేసిన సంగతి తెలిసిందే. వేయి కాళ్ల మండపాన్ని కూల్చివేసినందుకు రాజకీయ, ఆధ్మాత్మిక వర్గాల నుంచి తితిదే అనేక విమర్శలను ఎదుర్కొంది.
అయితే ఆ కట్టడాన్ని తిరిగి నిర్మిస్తామని తితిదే చెబుతూ వచ్చింది. తన హామీకి అనుగుణంగా ఇప్పుడు దేవస్థానం, వేయి కాళ్లని పునర్మించేందుకు టెండర్లను ఆహ్వానించింది. శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న నారాయణ ఉద్యానవనంలో ఈ వేయికాళ్ల మండపాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం 18 కోట్ల రూపాయలు ఖర్చవుతుందనీ, పాత స్తంభాలలో వీలైనన్ని స్తంభాలను వీటిలో వాడనున్నామనీ, మండపం మధ్యలో కనీసం 3,000 కూర్చునేందుకు వీలుగా విశాలంగా దీన్ని నిర్మించనున్నామనీ... తితిదే అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణం కనుక పూర్తయితే నారాయణ ఉద్యానవనం తిరుమలలోని మరో గొప్ప పర్యాటక స్థలంగా మారిపోతుందనడంలో సందేహం లేదు!


.jpg)
.jpg)


