తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

 

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు  8 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు.  అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని  6 కంపార్టుమెంట్లలో భక్తులు నిండిపోయాయి. ఆదివారం శ్రీవారిని 84,442 మంది భక్తులు దర్శించుకోగా.. 24,692 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చింది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu