మోడీ విధానాలకు ప్రజా మద్దతు ఈ ఫలితాలు.. చంద్రబాబు

posted on: May 4, 2026 12:36PM

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు  వెలువడుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో.. బీజేపీ నేతృత్వంలోని, ఎన్డీయే కూటమి  విజయం సాధించింది.  స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెడుతూ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది.  

ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం   ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై, ప్రజలకున్న  విశ్వాసానికి నిదర్శనమని   పేర్కొన్నారు.  

సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్' స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎన్డీయే నిలిచిందన్న ఆయన..  అభివృద్ధి పట్ల ఎన్డీయేకు ఉన్న నిబద్ధతకు  ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చారని  పేర్కొన్నారు.    ఈ చారిత్రాత్మక విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, గెలుపొందిన అభ్యర్థులకు చంద్రబాబు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...