Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మమత పతనానికి ప్రధాన కారణాలు
posted on: May 26, 2026 1:03PM

విచారకరమైన పతనాలు కొన్ని ఉంటాయి. విషాదకరమైన పతనాలు కొన్ని ఉంటాయి. ఆపై, పూర్తిగా హాస్యాస్పదంగా.. భావోద్వేగాలను బయటపెట్టే పతనాలు కూడా ఉంటాయి. మమతా బెనర్జీ మనం తనను మళ్ళీ చూస్తామని నమ్ముతారు, బహుశా మనం ఆమెను మళ్ళీ చూస్తామేమో, కానీ బహుశా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాదు.
బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి తర్వాత.. ఆమె ఓటమి జరిగి వారాలు గడిచినా కూడా పశ్చిమ బెంగాల్ నలుమూలలా సంబరాలు జరుగుతున్నాయి. ప్రజలు తమ ఆనందాన్ని ఆపుకోలేకపోతున్నారు. అంతే కాదు వారు ఎంతో సృజనాత్మకంగా, వినోదాత్మకంగా కూడా వేడుకలు జరుపుకుంటున్నారు. ఒక పాకిస్తానీ నటుడిని చూసినప్పుడు బాలీవుడ్ కన్నా ప్రజలు ఎక్కువ సంతోషంగా ఉన్నారా? అనే ప్రశ్నకు సమాధానం.. బెంగాల్ చరిత్రలో దాగి ఉంది.
మమతా బెనర్జీ 15 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించారు. 2011 ప్రారంభంలో ఆమెకు అపారమైన ప్రజాదరణ ఉన్న సమయంగా ఉండేది. క్రూరమైన కమ్యూనిస్ట్ నియంతృత్వం నుంచి పశ్చిమ బెంగాల్ ప్రజలను రక్షించిన మహిళగా ఆమెను చూశారు. అయితే, మార్పు కావాలి, ప్రతీకారం కాదు అనే ఆమె వాగ్దానం ఎంత డొల్లదో, కొన్ని నెలల్లోనే స్పష్టమైంది. గత 15 ఏళ్లుగా ఆమె పశ్చిమ బెంగాల్లో సృష్టించిన భయానక పాలనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని భారతదేశంలోనూ, భారతదేశం వెలుపల కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.
ప్రాచీన కాలం నుంచి బెంగాల్ భారతదేశానికి ఒక ముఖ్యమైన సాంస్కృతిక కేంద్రంగా ఉంది. అలెగ్జాండర్ కాలం నాటి ప్రాచీన గ్రీకు గ్రంథాలలో, మహాభారతంలో కూడా బెంగాల్ ప్రస్తావించబడింది. 19వ శతాబ్దంలో హిందూ సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి బెంగాల్ ఒక నిలయం. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద నవ వేదాంతాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. శ్రీ అరబిందో దేశాన్ని తల్లిగా పవిత్రం చేసి, జాతీయవాదమే సనాతన ధర్మం అని ప్రకటించారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ.. ఆనందమఠం, వందేమాతరం రచన చేశారు. సుభాష్ చంద్ర బోస్
ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపన చేశారు. అనుశీలన్ సమితి, జుగంతర్ వంటి విప్లవ సంస్థలు ఏర్పాటు చేశారు, బాఘా జతిన్, బరీన్ ఘోష్, ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల చాకి, రాష్బిహరి బోస్, సూర్య సేన్ వంటి విప్లవకారులు బెంగాల్ నుండే ఆవిర్భవించారు.
కానీ దురదృష్టవశాత్తు, అది పాత బెంగాల్. ఇది నేటి బెంగాల్, అప్పటి బెంగాల్కి ఇప్పటి బెంగాల్ కీ ఎంత తేడా ఉందో, అరవింద్ కేజ్రీవాల్ స్వీయ ప్రతిబింబానికి, వాస్తవ ప్రపంచంలో ఆయన ప్రభావానికి కూడా అంతే తేడా ఉంది. పశ్చిమ బెంగాల్తో ఉన్న సమస్య ఏమిటంటే, భారతదేశంలో మరెక్కడా లేనంతగా నిరంతరాయంగా, వ్యవస్థీకృతంగా రాజకీయ హింస ఇక్కడే చోటుచేసుకుంది. 1999 నుంచి 2016 వరకు, జాతీయ నేరాల రికార్డుల బ్యూరో ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సగటున 20 రాజకీయ హత్యలు నమోదు చేసింది. 1980, 1990, 2000వ దశకాలలో, సీపీఐఎం ఒక అధికారిక రాజకీయ హింసా వ్యవస్థను అభివృద్ధి చేసింది. వారు హర్మద్ బహిని అని పిలిచే సాయుధ కేడర్లను అభివృద్ధి చేశారు. ఈ హర్మద్ బహిని భారత రాజకీయ చరిత్రలో అత్యంత క్రూరమైన సామూహిక హత్యాకాండలలో కొన్నింటిని నిర్వహించింది. 1979 సైన్బారి మారణకాండ. వారు పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను పద్ధతి ప్రకారం వేటాడారు.
మతపరమైన హింస కారణంగా బంగ్లాదేశ్ను విడిచిపెట్టిన తర్వాత పదివేల మంది బంగ్లాదేశీ హిందువులు ఆశ్రయం పొందిన ద్వీపమే మారిచ్ఝాపి. సీపీఎం ఈ హిందువులను ద్వీపాన్ని విడిచిపెట్టి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్ళమని కోరింది, కానీ వారు అక్కడ ఊచకోతకు గురవుతారనే భయంతో స్పష్టంగా అలా చేయలేకపోయారు. సీపీఎం ఆధ్వర్యంలోని పోలీసు బలగాలు సుమారు 10 వేల నుంచి 15 వేల మంది దళిత హిందువులను హత్య చేశాయని ఆరోపణలు ఉన్నాయి. మహిళలు, బాలికలపై దాడులు జరిగాయి. ఈ ప్రజలకు పంపించాల్సిన సహాయాన్ని వెనక్కి పంపించారు.
ఇక సీపీఎం యొక్క ఇతర దుశ్చర్యలు ఎలాంటివో చూస్తే.. పోలీసు వ్యవస్థను పార్టీకి అనుబంధంగా మార్చారు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఉద్భవించక ముందే వాటిని నిర్మూలించడానికి పోలీసులను ఉపయోగించుకుంది. అసమ్మతిని నేరంగా పరిగణించి, పోలీసులు, హర్మద్ బహిని ద్వారా శారీరకంగా శిక్షించారు. ప్రత్యర్థి పార్టీల మహిళా కార్యకర్తలు, మహిళా రాజకీయ ప్రత్యర్థులపై లైంగిక దాడులను ఒక రాజకీయ ఆయుధంగా.. ఉపయోగించడంలో సీపీఎం ప్రత్యేకంగా క్రూరమైన పేరు సంపాదించుకుంది. లెఫ్ట్ ఫ్రంట్ హింసా సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడటం ద్వారానే మమతా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు, 2011లో ఆమె లెఫ్ట్ను అధికారం నుంచి పడగొట్టారు. ఆమె వాగ్దానం ఎంతో స్పష్టంగా ఉంది. అదేంటంటే మాకు మార్పు కావాలి, ప్రతీకారం కాదు. అయితే, 2011 మేలో అధికార మార్పిడి జరిగిన వెంటనే, వామపక్ష కార్యకర్తలపై ప్రతీకార హింస చెలరేగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మొదటి మూడు వారాల్లోనే లెఫ్ట్ పార్టీలకు చెందిన 13 మంది నాయకులు, కార్యకర్తలు హత్యకు గురయ్యారని సీపీఐఎం ఆరోపించింది. ప్రాథమికంగా తాము ద్వేషించిన దానిలాగానే టీఎంసీ సైతం మారింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు సృష్టించిన మొత్తం హింసాత్మక వ్యవస్థను స్వీకరించింది. మార్పు చెందిన పేర్లు, అదే వ్యవస్థగా మారింది. ఇలా అప్పటికీ- ఇప్పటికీమరేం మారలేదన్న మాట వినిపించింది.
2018 పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలను ఎన్నికల విధ్వంసంలో ఒక మైలురాయిగా అభివర్ణిస్తారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా నిరోధించడానికి టీఎంసీ కార్యకర్తలు హింసను ఉపయోగించారు. దీని ఫలితంగా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా 34శాతం పంచాయతీ స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలుచుకుంది.
ఎన్నికల అనంతర హింస పరిణామ క్రమానికి చెందిన వివరాల్లోకి వస్తే.. 2019 లోక్సభ ఎన్నికలలో, పశ్చిమ బెంగాల్లోని 42 స్థానాలకు గాను బీజేపీ 18 స్థానాలను గెలుచుకుంది. దీని తర్వాత మళ్లీ వ్యవస్థీకృత ప్రతీకార హింస మొదలైంది. ఈ ఎన్నికల తర్వాత హింసలో 300 మందికి పైగా బీజేపీ రాజకీయ కార్యకర్తలు హత్యకు గురయ్యారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
2021 ఎన్నికల తర్వాత.. భారత ప్రభుత్వ ఏర్పాటు చేసిన వాస్తవ నిర్ధారణ కమిటీ నివేదిక ప్రకారం.. హింసాత్మక ఘటనలు-
మే 2-5, 2021.. 16 జిల్లాల్లో.. 15వేలకు పైగా మహిళలపై లైంగిక వేధింపులు, 7వేల మందికి పైగా.. టీఎంసీయేతర పార్టీలకు చెందిన రాజకీయ కార్యకర్తలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అస్సాం, జార్ఖండ్, ఒడిశాకు పారిపోవలసి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ను అధికారం నుంచి తొలగించిన తర్వాత మహిళలు ఎందుకు ప్రత్యేకంగా సంతోషంగా ఉన్నారు, ఎందుకు అంత ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారో చూస్తే..
నదియా జిల్లాలోని హన్స్ఖాలిలో ఒక స్థానిక టీఎంసీ పంచాయతీ సభ్యుడి కుమారుడు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలో 14 ఏళ్ల బాలికపై దాడి జరిగింది. పోలీసులు మొదట ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. టీఎంసీ పాలనలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపులు ఒక రాజకీయ ఆయుధంగా మారాయని ఆరోపణలు ఉన్నాయి.
మమతా బెనర్జీ ఓటమికి ప్రజలు ఎందుకు అంత సంతోషంగా ఉన్నారో ఈ వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.
2011లో అధికారంలోకి వచ్చిన వెంటనే వామపక్ష కార్యకర్తలపై ప్రతీకార హింస. సిపీఎం హర్మద్ బహిని నమూనాను యాజ్ టీజ్ గా కొనసాగింపు. 2018 పంచాయతీ ఎన్నికలు. 34శాతం స్థానాలు ఏకగ్రీవం. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా నిరోధించడం. 2019 తర్వాత హింస. 300 మందికి పైగా బీజేపీ కార్యకర్తల హత్య. 2021 తర్వాత . 15వేల ఘటనలు, 7వేల మంది మహిళలపై లైంగిక వేధింపులు. భయానక వాతావరణం. టీఎంసీయేతరులకు రాష్ట్రంలో నివసించడం కష్టంగా మారిన పరిస్థితులు. మాకు మార్పు కావాలి, ప్రతీకారం కాదు అనే వాగ్దానం, 15 ఏళ్లలో ఎలా మారిందంటే, మాకు ప్రతీకారం కావాలి, మార్పు కాదు అన్నట్లుగా మారింది. మార్పు అనే పేరుతో ప్రతీకారాన్ని ప్రతిజ్ఞగా తీసుకున్న పాలనకు ప్రజలు తిరస్కారం తెలిపారు. దీంతో బెంగాల్లో.. గడ్డిపూలు చితికిపోయి.. కమలవికాసం జరిగింది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.





