చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తిన లలితాజువెలర్స్ అధినేత 

posted on: Sep 9, 2024 2:26PM

డబ్డులు ఊరికే రావు అనే డైలాగ్ తో తెలుగునాట ఫేమస్ అయిన లలితా జువెలర్స్ అధినేత  కిరణ్ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. భారీ వర్షాలకు ఎపిలో జరిగిన నష్టాన్ని పూడ్చడానికి దాతలు  విరాళాలు ఇవ్వడానికి ముందు కొస్తున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదిరూపాయల నుంచి 100  రూపాల వరకు ఎంతైనా సరే మీ స్తోమతను బట్టి  వరద బాధితుల కోసం సాయం చేయండి అని ప్రజలను కోరారు. తన వంతుగా కోటి రూపాయలు వరదబాధితులకు ఇస్తున్నాను అని కిరణ్ ప్రకటించారు.  74 ఏళ్ళ వయసులో కూడాసీఎం చంద్రబాబు ప్రజల కోసం రాత్రిం బవళ్లు శ్రమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని ఆయన కితాబిచ్చారు. ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని కిరణ్ పిలుపునిచ్చారు. 
 

google-ad-img
    Related Sigment News
    • Loading...