Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలుగు మాటలతో వల.. లోన్ పేరుతో బురిడీ.. ఢిల్లీ ఫేక్ కాల్ సెంటర్ల గుట్టురట్టు..!
posted on: Aug 10, 2026 7:45PM

హలో సార్.. మేడమ్.. మేము ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తక్కువ వడ్డీకే భారీ లోన్ మంజూరైంది”.. అంటూ తెలుగులో మధురంగా పలకరింపు. మాటల్లో నమ్మకం కలిగించి.. ఆ తర్వాత ఒక్కో ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేయడం. చివరకు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి చేతులు దులుపుకోవడం. ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఈ సైబర్ మోసాల దందాకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) చెక్ పెట్టింది. ఢిల్లీలోని శివ మార్కెట్లో నిర్వహిస్తున్న మూడు మోసపూరిత కాల్ సెంటర్ల పై టీజీసీఎస్బీ అధికారులు దాడులు చేసి 21 మంది మహిళా టెలీకాలర్లు, ఒక బ్యాంకు ఖాతాదారుడిని అరెస్ట్ చేశారు.
ఈ కాల్ సెంటర్ల వెనుక కీలకంగా వ్యవహరి స్తున్న లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ కోసం పోలీసులు గాలిస్తు న్నారు.ఏడాదిన్నరగా సాగుతున్న ఈ దందాలో తెలుగు మాట్లాడే మహి ళలే ప్రధాన ఆయుధంగా మారారు. తెలంగాణకు చెందిన 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని బాధితులకు ఫోన్లు చేయించేవారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడే మహిళలతో ఫోన్ చేయించడం ద్వారా బాధితుల నమ్మకాన్ని సులభంగా పొందేవారు. తాము బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధు లమంటూ పరిచయం చేసుకుని ఆకర్షణీయమైన లోన్ ఆఫర్లతో వల విసిరేవారు.
లోన్ కావా లంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫి కేషన్ ఛార్జీలు, డాక్యుమెం టేషన్ ఫీజు, బీమా ప్రీమియం తదితర రుసుములు చెల్లించా లంటూ నమ్మించి వరుసగా డబ్బులు వసూలు చేసేవారు. బాధితుడు డబ్బులు చెల్లించిన తర్వాత మరింత మొత్తం అడగడం లేదా ఫోన్కు స్పందించకుండా తప్పించు కోవడం చేసేవారు.
మోసపోయామని గ్రహించి డబ్బులు తిరిగి అడిగిన వారిని కూడా వదిలిపెట్ట లేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తప్పవంటూ బెదిరించడంతో పాటు వ్యక్తిగత వివరాలు, గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తామని హెచ్చరించే వారు.
టీజీసీఎస్బీ దాడుల్లో 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు పాస్బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులోనే ఈ ముఠాకు తెలంగాణలో నమోదైన 22 సైబర్ నేర కేసులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మూడు కాల్ సెంటర్ల వెనుక ఉన్న ప్రధాన నిర్వాహకులు లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ముఠా వెనుక ఉన్న మరిన్ని వివరాలు, ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేశారు? ఎంత మొత్తం కొల్లగొట్టారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
TGCSB, Lalit Singh, Kuldeep Singh, Anil, Delhi Fake Call Centers, cyber crime case


.webp)



