మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు ముదురుతున్నాయా?

posted on: Apr 13, 2026 10:26AM

సంకలనం, సేకరణ: సీతారాం కంఠంనేని

మధ్యప్రాచ్య ప్రాంతంలో జరుగుతున్న తాజా పరిణామాలు గ్లోబల్ భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే దిశగా సాగుతున్నాయి.
అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్  చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చాయి. 
 పాకిస్తాన్ ద్వారా చైనా క్షిపణులు ఉపయోగించి అమెరికా నౌకను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ చర్యగా పరిగణించవచ్చు 
 
  కీలక ఆరోపణలు
అమెరికా నిఘా వర్గాలు మరియు విశ్లేషణ సంస్థల ప్రకారం..
 చైనా ఇరాన్ కు  సైనిక సహాయం అందించడానికి సిద్ధమవుతోంది  క్షిపణి వ్యవస్థలకు అవసరమైన పదార్థాల సరఫరా ఇప్పటికే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. 
- కొత్త వాయు రక్షణ వ్యవస్థలు పంపే అవకాశం 
- ఈ రవాణాను దాచిపెట్టడానికి మూడవ దేశాల వినియోగం 
-ఈ మొత్తం వ్యవస్థలో పాకిస్థాన్  ఒక ట్రాన్సిట్ పాత్ర పోషించిందని ఆరోపణలు ఉన్నాయి 
  అమెరికా నౌకపై దాడి వివాదం
ఇటీవల ఇరాన్ అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది 
యూఎస్ఎస్ ఇబ్రహింలింకన్ నౌక లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో  ఉపయోగించిన క్షిపణులు సరఫరా చేసినవి..వాటిని పాకిస్థాన్ ద్వారా అందించిందన్న రోపణలు వెలువడ్డాయి 
 వ్యూహాత్మక విశ్లేషణ
1.  పరోక్ష యుద్ధం మోడల్ ఈ సంఘటనలు సూచిస్తున్నది 
దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకుండా 
మూడవ దేశాల ద్వారా దాడులు చేయడం 
 దీనినే ప్రోక్సీవార్ ఫేర్.. పరోక్ష యుద్ధంగా పిలుస్తారు
 
2. చైనా పాత్ర
చైనా పై ఉన్న అనుమానాలు:
ఇరాన్ కు సాంకేతిక,  సైనిక మద్దతు 
గ్లోబల్ ప్రభావాన్ని పెంచుకోవాలనే వ్యూహం 
ఇది అమెరికా–చైనా పోటీని కొత్త దశలోకి తీసుకెళ్తుంది
 
 పాకిస్తాన్ పై ప్రశ్నలు
అమెరికా విశ్లేషకులు, ముఖ్యంగా 
డగ్లస్ మెక్‌గ్రెగర్ పాకిస్తాన్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేశారు.
 ఆర్థిక సంక్షోభం 
 రాజకీయ అస్థిరత 
 నిష్పాక్షికతపై సందేహాలు 
 ఈ నేపథ్యంలో.. ఇరాన్, అమెరికా చర్చలకు పాకిస్తాన్ సరైన మధ్యవర్తా కాదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
 
 భారతదేశం – ఒక ప్రత్యామ్నాయం?
డగ్లస్ మాక్గ్రెగర్ అభిప్రాయం ప్రకారం,  భారత్ మధ్యవర్తిత్వానికి మరింత అనుకూల స్థితిలో ఉంది
కారణాలు..
 బలమైన అంతర్జాతీయ సంబంధాలు 
సమతుల్య విదేశాంగ విధానం 
పలు శక్తులతో సంభాషణ సామర్థ్యం 
ప్రధాని మోదీ – ట్రంప్ చర్చలు జరపాలన్నది డగ్లస్ మాక్గ్రెగర్ సూచన
ఇరాన్ ఆధిక్యం?
డగ్లస్ మాక్గ్రెగర్ విశ్లేషణ ప్రకారం
ప్రస్తుతం ఇరాన్ వ్యూహాత్మకంగా బలంగా ఉంది 
అమెరికా ఎంపికలు తగ్గుతున్నాయి 
ట్రంప్ తన వద్ద ఉన్న సైనిక శక్తిని పూర్తిగా వినియోగించాల్సి రావచ్చు… కానీ విజయం  గ్యారంటీ లేదు.  
 గ్లోబల్ భద్రతా ప్రభావం
బహుళ శక్తుల మధ్య ప్రత్యక్ష–పరోక్ష ఘర్షణలు 
సైనిక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పెరుగుదల 
గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ మార్పు  
  పరిశోధనా సంస్థల హెచ్చరిక
యుద్ధ అధ్యయన సంస్థ (ఐఎస్ డబ్ల్యు) నివేదిక ప్రకారం 
చైనా, ఇరాన్ కు సైనిక సహాయం అందిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి
అమెరికా అంతర్గత భద్రతపై ఆందోళనలు
మైక్ ఫ్లిన్ ప్రకారం..
 అమెరికాకు విదేశీ ముప్పు  చాలా వాస్తవమైనది.
భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం  ఉంది.
 శాంతి చర్చలు – ఆశా కిరణమా?
ఈ ఉద్రిక్తతల మధ్య.. అమెరికా, ఇరాన్  ఇస్లామాబాద్లో చర్చలకు సిద్ధమవుతున్నాయి
 అయితే..    మధ్యవర్తి నిష్పాక్షికత, విశ్వాస లోపం  ఈ చర్చల విజయాన్ని ప్రభావితం చేయవచ్చు 
ప్రస్తుతం ప్రపంచం ఒక సున్నితమైన దశలో ఉంది. ప్రత్యక్ష యుద్ధం కాదు.. కానీ పరోక్ష శక్తుల పోరు

ఈ సంక్షోభం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది.  ఆధునిక యుద్ధాలు కేవలం యుద్ధభూముల్లోనే జరగవు. అవి వ్యూహాలు, కూటములు, సాంకేతిక మార్గాల్లో కూడా జరుగుతాయి. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అందులో ప్రతి దేశం తన స్థానం కోసం పోరాడుతోంది. పాకిస్తాన్ ద్వారా చైనా క్షిపణులను ఉపయోగించి అమెరికా నౌకను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ చర్యే అని ట్రంప్ మాజీ ఎన్ఎస్ఏ సలహాదారు చెప్పారు.  ఇరాన్ కు ఆయుధాల రవాణాకు చైనా సిద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.  రాబోయే వారాల్లో ఇరాకు కొత్త వాయు రక్షణ వ్యవస్థలను పంపడానికి చైనా సిద్ధమవుతున్నట్లు సమాచారం.  ఈ రవాణాను దాచిపెట్టడానికి బీజింగ్ మూడవ దేశాలను ఉపయోగించుకోవచ్చని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. తమ మధ్య కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లోఅమెరికా, ఇరాన్  ఉన్నత స్థాయి చర్చలు జరిపిన  తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఆధిక్యంలో ఉంది, తనకున్నదంతా ప్రయోగించడమే ట్రంప్ కు ఉన్న ఏకైక మార్గమని డగ్లస్ మాక్గ్రెగర్ అన్నారు.   పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తీవ్రమైన అంతర్గత ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఉటంకిస్తూ, పశ్చిమ ఆసియా సంక్షోభంలో మధ్యవర్తిగా దాని విశ్వసనీయతను అమెరికా మాజీ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్గ్రెగర్ ప్రశ్నించారు. బలమైన ప్రపంచ సంబంధాలున్న భారతదేశం మధ్యవర్తిత్వ పాత్రకు మెరుగైన స్థితిలో ఉందని ఆయన సూచించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్  చర్చలు జరపాలని ప్రధాని మోదీని ఆయన కోరారు.
డగ్లస్ మాక్గ్రెగర్ ప్రకారం.. ఇరాన్ దే పైచేయి.  ప్రపంచవ్యాప్తంగా,  దేశీయంగా ఎదురయ్యే అవమానాన్ని తప్పించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ భారీ సంప్రదాయ సైనిక శక్తిపై ఆధారపడాల్సి వస్తోందనీ, అయినప్పటికీ విజయం అనుమానమేనని పేర్కొన్నారు. 

పెంటగాన్ మాజీ  సలహాదారు,  అమెరికా మాజీ రక్షణ మంత్రి, రిటైర్డ్ కల్నల్ డగ్లస్ మాక్గ్రెగర్..  మధ్యప్రాచ్య సంఘర్షణ గమనంపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇరాన్ వ్యూహాత్మక ఆధిక్యాన్ని కలిగి ఉందని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆచరణీయమైన మార్గాలు తగ్గిపోతున్నాయనీ, ఇక ట్రంప్ ఆయన తన వద్ద సాయుధ సంపత్తి మొత్తం ఇరాన్ పై ప్రయోగించాల్సి ఉంటుందని  పేర్కొన్నారు.

ఇరాన్ కు చైనా సరఫరా చేసిన క్షిపణులను అందించడంలో ఇస్లామాబాద్ పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో, ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు "నిష్పాక్షిక మధ్యవర్తి"గా వ్యవహరించగల పాకిస్తాన్ సామర్థ్యంపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జనరల్ మైక్ ఫ్లిన్ అనుమానాలు వ్యక్తం చేశారు. 

 జనరల్ ఫ్లిన్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తన మొదటి పదవీకాలంలో ఆయనకు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఉపయోగించిన క్షిపణులను చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) సరఫరా చేసిందని, వాటిని పాకిస్తాన్ పంపిందని ఫ్లిన్ ఆరోపించారు. అమెరికా, ఇరాన్లు ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ నేపథ్యంలో జనరల్ ఫ్లిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని పక్షాలకూ తమ వైఖరిపై స్పష్టత వచ్చేవరకు ఈ పరిస్థితి నుండి బయటపడటం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

ఈ వారం ప్రారంభంలో, ప్రముఖ అమెరికా సైనిక పరిశోధనా సంస్థ 'ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్' (ఐఎస్ డబ్ల్యు), సంక్షోభంలో ఉన్న ఇరాన్ ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ చైనా సైనిక సహాయం అందిస్తోందని పేర్కొంది.  అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఫ్లిన్, అమెరికా అంతర్గత భద్రతపై దృష్టి సారించారు. ఇరాన్ నుండి అమెరికాకు ఉన్న విదేశీ ముప్పు  చాలా వాస్తవమైనది  అని, ఈ విషయంలో అధికారులు చురుకుగా నిమగ్నమై ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.  యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చైనా, ఇరాన్కు క్షిపణి ఇంధన తయారీకి వాడే ముడి పదార్థాన్ని పలుమార్లు పంపిందని పాశ్చాత్య మీడియా నివేదించింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత, ఇరాన్ సైనిక దళాలు తమ క్షిపణి వ్యవస్థను పునర్నిర్మించుకోవడానికి కృషి చేస్తున్నాయని సమాచారం.

గత నెలలో, యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను తీరప్రాంత క్రూయిజ్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా విమాన వాహక నౌకపై సాయుధ దళాలు క్షిపణులను ప్రయోగించాయని పేర్కొంటూ ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ ఒక వీడియోను ప్రచురించగా, ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ, ఈ ఆపరేషన్ను నావికాదళ అధికారులు వివరించినట్లు పేర్కొంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...