మంచిర్యాలలో మంత్రి, ఎంపీ వాహనంపై దాడి

posted on: Feb 17, 2026 3:37PM

 

మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి వస్తుండగా మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రయాణిస్తున్న వాహనంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్విన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో వాహనానికి చెందిన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. 

దాడి నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే మంత్రి, ఎంపీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ప్రజా ప్రతినిధులపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో క్యాతనపల్లి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...