Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ డీజీపీ ఎదుట 47 మంది మావోలు లొంగుబాటు
posted on: Apr 25, 2026 6:55PM

తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు సంచలనంగా మారింది. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మొత్తం 47 మంది మావోయిస్టు కేడర్లు జనజీవన స్రవంతిలోకి చేరారు. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసుల వివరాల ప్రకారం, Peoples Liberation Guerrilla Army (PLGA)కు చెందిన కీలక కమాండర్ హేమ్లాతో పాటు 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరు ప్రధానంగా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినవారని అధికారులు తెలిపారు. లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు 32 ఆయుధాలు, 515 తూటాలను పోలీసులకు అప్పగించారు. ఇది భద్రతా దళాలకు పెద్ద విజయంగా అధికారులు పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడిన డీజీపీ శివధర్ రెడ్డి, రాష్ట్రంలో శాంతి భద్రతల బలోపేతానికి ఇది కీలక అడుగని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు–పునరావాస విధానంపై విశ్వాసం పెరగడంతోనే మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.“తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోయిస్టులు లొంగిపోవడం రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పరిణామం. ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలపై నమ్మకం పెరిగినందునే వారు హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరుతున్నాం” అని డీజీపీ పేర్కొన్నారు.
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన కీలక నాయకులు కూడా ఈ లొంగుబాటులో ఉన్నారు. వీరిలో దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్చార్జి హేమ్లా, డివిజనల్ కమిటీ సభ్యుడు మరియు 9వ ప్లాటూన్ కమాండర్ పోడియం లచ్చు @ మనోజ్ వంటి నాయకులు ఉన్నారు. ఈ లొంగుబాటుతో దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ దాదాపు నిర్వీర్యమైందని డీజీపీ తెలిపారు.లొంగిపోయిన వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో LMGలు, AK-47లు, SLR, INSAS రైఫిల్స్, మస్కెట్ రైఫిల్స్, పిస్టల్స్, రివాల్వర్లు, BGL గన్స్, ఎయిర్ గన్స్, SBBL గన్స్ ఉన్నాయి.
అదేవిధంగా, PLGA బెటాలియన్ నుంచి 4 మంది, DKSZC నుంచి 28 మంది, 9వ మరియు 30వ ప్లాటూన్ల నుంచి 15 మంది లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.ఇంకా అజ్ఞాతంలో ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోషం, స్టేట్ కమిటీ సభ్యురాలు జాడి రత్నబాయి అలియాస్ సుజాత, స్టేట్ కమిటీ సభ్యుడు వార్తా శేఖర్ అలియాస్ మంగు కూడా లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.గత రెండేళ్లలో మొత్తం 818 మంది మావోయిస్టులు లొంగిపోగా, 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల బలోపేతానికి ఇది మరో కీలక ముందడుగని ఆయన అన్నారు.



.webp)


