ఎవరికీ దక్కని ఆధిపత్యం
posted on: May 12, 2014 10:50AM

సీమాంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా కొన్ని మునిసిపల్ స్థానాల్లో ఎవరికీ ఆధిపత్యం దక్కని విధంగా ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కౌంటింగ్ పూర్తయిన రెండు స్థానాల్లో ఏ పార్టీకీ ఆధిపత్యం దక్కలేదు. ఏ పార్టీ సొంత బలంతో మునిసిపల్ ఛైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు. సీమాంధ్రలో ప్రకాశం జిల్లా చీరాలలో మొదట వైకాపా ఆధిపత్యం కొనసాగింది. అయితే ఆ తర్వాత ఆ పార్టీ వెనుకబడిపోయి తెలుగుదేశం ముందడగు వేసింది. మొత్తం మీద ఈ రెండు పార్టీలకూ ఈ స్థానంలో ఆధిపత్యం దక్కలేదు. అలాగే వరంగల్ జిల్లా మహబూబాబాద్ మునిసిపల్ స్థానంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మొత్తం 28 వార్డుల్లో టీఆర్ఎస్ ఏడు, కాంగ్రెస్ ఏడు, టీడీపీ మూడు, సీపీఎం ఐదు, సీపీఐ మూడు, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. ఈ రెండు స్థానాల్లోనూ ప్రలోభాలు పనిచేసే అవకాశం వుంది.



.jpg)
.jpg)
.webp)

.webp)


