Latest News

ఈ-టీవీ, సాక్షి ఛానళ్ళ ప్రసారాలపై కూడా వేటు?

posted on: Dec 8, 2014 3:41PM

 

గత ఐదున్నర నెలలుగా తెలంగాణాలో ఆంధ్రజ్యోతి, టీవి-9 న్యూస్ ఛానళ్ళపై నిషేధం కొనసాగుతున్న సంగతి, దానిపై సుప్రీంకోర్టులో పిటిషను వేయడం గురించి అందరికీ తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా ఆంధ్రాకు చెందిన మరో రెండు న్యూస్ ఛానళ్ళు(ఈ-టీవి ఆంద్రప్రదేశ్ మరియు సాక్షి) కూడా ప్రసారం కావడం లేదని సికింద్రాబాద్ లోని మారేడ్ పల్లి, సైనిక్ పూరి, తార్నాక, హబ్సిగూడా మరియు ఉప్పల్ ప్రాంతాల ప్రజల నుండి పిర్యాదులు అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వాటిపై ఎటువంటి నిషేధము లేదని గ్రేటర్ హైదరాబాద్ కేబిల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు యల్. హరి గౌడ్ తెలిపారు. జంట నగరాలలో దాదాపు 90శాతం కేబిల్ ప్రసారాలను నాలుగు కేబిల్ ఆపరేటింగ్ సంస్థలు నిర్వహిస్తున్నాయని, వారి మధ్య ఈ ప్రసారాల ద్వారా వచ్చే ఆదాయం పంచుకోవడంలో ఏమయినా సమస్యలు ఏర్పడినట్లయితే ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఆ కారణంగా యం.యస్.ఓ.లు సదరు న్యూస్ ఛానల్స్ యాజమాన్యాలకి ‘క్యారీయింగ్ ఫీజ్’ చెల్లించడంలో ఆలస్యం అవడం చేత తాత్కాలికంగా ఏవయినా చానల్స్ నిలిచిపోయి ఉండవచ్చు తప్ప కొత్తగా దేనిపైనా ఎటువంటి నిషేధం లేదని చెప్పారు. ఇంతవరకు నిలిపివేయబడిన టీవి-9 న్యూస్ ఛానల్ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో ప్రసారం అవుతున్నట్లు సమాచారం.

google-ad-img
    Related Sigment News
    • Loading...