Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమ్ ఇండియా
posted on: Jun 21, 2026 6:24AM
.webp)
ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్ను టీమ్ ఇండిచా క్లీన్స్వీప్ చేసింది. శనివారం (జూన్ 20) చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్థాన్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు బ్యాటింగ్ ప్రారంభించకుండానే ఐదు పరుగులు వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది పిచ్పై డేంజర్ ఏరియాలో పరుగెత్తడంతో అంపైర్లు పెనాల్టీ రూపంలో భారత్కు ఐదు అదనపు పరుగులు కేటాయించారు. దీనివల్ల భారత ఇన్నింగ్స్ 5/0 స్కోరుతో మొదలైంది.
ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అంపైర్ ఇచ్చిన పెనాల్టీ రన్స్ తో కలిసి టీమ్ ఇండియా తొలి ఓవర్ లో ఏకంగా 23 పరుగులు సాధించింది. దీంతో 2004లో బంగ్లాదేశ్పై తొలి ఓవర్లోనే 22 పరుగులు సాధించి నెలకొల్పిన పాత రికార్డు కనుమరుగైపోయింది.
ఈ విధ్వంసకర ఆరంభాన్ని భారత ఓపెనర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. దీంతో కేవలం 28.4 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 224 పరుగులు చేసి భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రోహిత్ శర్మ 79 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 110 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 20 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది.
భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ కేవలం 23 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్లోనే ఉత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.అంతే కాకుండా చెన్నై చిదంబరం స్టేడియంలో ఐదు వికెట్లు తీసిన తొలి ఇండియన్ పేసర్గా నిలిచాడు. ప్రసిద్ధ్ ధాటికి 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆప్ఘన్ జట్టును ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది ఆదుకున్నాడు. కెప్టేన్స్ ఇన్నింగ్స్ ఆడిన . హష్మతుల్లా షాహిది 102 పరుగులు చేశాడు. ఇది హష్మతుల్లా షాహిది కెరీర్లో తన తొలి వన్డే సెంచరీ. అతనికి తోడుగా ఒమర్జాయ్ కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆప్ఘనిస్థాన్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది.






