తూర్పు గోదావరిలో తెలుగుదేశం హవా

posted on: May 12, 2014 12:11PM

 

 

 

తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ హవా నడుస్తోంది. మొత్తం పది మునిసిపల్ స్థానాల్లో ఎనిమిది స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమలాపురంలోని 30 కౌన్సిలర్ స్థానాల్లో తెలుగుదేశం 22, వైసీపీ 7, ఇతరులు 1 స్థానాలు గెలుచుకున్నారు. తునిలోని 30 స్థానాల్లో కాంగ్రెస్ 2, టీడీపీ 17, వైకాపా 12 స్థానాలు గెలుచుకున్నాయి. సామర్లకోటలోని 30 స్థానాల్లో తెలుగుదేశం 24, వైకాపా 6 స్థానాలు గెలిచాయి. రామచంద్రాపురంలోని 17 కౌన్సిలర్ స్థానాల్లో 16 తెలుగుదేశం గెలుచుకోగా ఆరు స్థానాలు మాత్రమే వైకాపా పొందింది. 1 ఇతరులు. పిఠాపురంలోని 30 స్థానాల్లో 23 తెలుగుదేశం, 6 వైకాపా గెలిచాయి. ఒకస్థానాన్ని ఇతరులు పొందారు. మండపేటలోని 29 స్థానాల్లో 18 తెలుగుదేశం, 11 వైకాపా గెలిచాయి. పెద్దాపురంలోని 28 స్థానాల్లో 21 తెలుగుదేశం, 4 వైకాపా గెలిచాయి. ఇతరులు మూడు స్థానాల్లో గెలిచారు. గొల్లప్రోలులోని 20 స్థానాల్లో కాంగ్రెస్ 1 గెలుచుకోగా తెలుగుదేశం, వైకాపా చెరో తొమ్మిది స్థానాల్లో గెలిచాయి. వామపక్షాలు 1 స్థానం గెలిచాయి. ముమ్మడివరంలోని 20 స్థానాల్లో తెలుగుదేశం, వైకాపా 8 స్థానాల చొప్పున గెలిచాయి. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచారు. ఏలేశ్వరంలోని 20 స్థానాల్లో కాంగ్రెస్ 1, తెలుగుదేశం 10, వైకాపా 9 స్థానాల్లో గెలిచాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...