కాంగ్రెస్, తెదేపా యంయల్సీలు జంప్
posted on: Jun 25, 2014 3:47PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల యంయల్సీలు తరలివస్తుంటే, తెలంగాణాలో కూడా అధికార తెరాస పార్టీలో చేరేందుకు, కాంగ్రెస్, తెదేపా, బీయస్పీలకు చెందిన నేతలు తరలి వెళ్ళిపోతున్నారు. రెండు ప్రాతీలు కూడా తాము ఇతర పార్టీల నేతలను ఆకర్షించడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయడంలేదని, రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోనేందుకు ఇతర పార్టీల నేతలు తమంతట తాముగా తమ పార్టీలలో చేరేందుకు తరలి వస్తున్నారని వాదిస్తున్నాయి. అయితే నిజానికి తెదేపా, తెరాసలకు శాసనసభలో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ శాసనమండలిలో బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి తగినంత సంఖ్యా బలం లేదు. ఆ కారణంగానే రెండు పార్టీలు కూడా శాసనమండలిలో కూడా తమ బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలోనే ఈ రోజు వివిధ పార్టీలకు చెందినా 9మంది యంయల్సీలను తెరాసలో చేర్చుకొనేందుకు రంగం సిద్దమయింది. ఈ రోజు తెరాసలో చేరుతున్న వారిలో చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన సలీం, శాసనమండలిలో తెదేపా ఫ్లోర్ లీడర్ గా నియమితులయినా వెంకటేశ్వరులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మొత్తం ఐదుగురు యం.యల్సీలు- అమోస్, భానుప్రసాద్, భూపల రెడ్డి, జగదీశ్వర రెడ్డి మరియు రాజలింగం ఈరోజు తెరాసలో చేరబోతున్నారు. ఇక బీయస్పీ నుండి ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, పీ.ఆర్ టీ యూకు చెందిన పీ. రవీంద్ర రెడ్డి, జనార్ధన్ రెడ్డి, మోహన్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతున్నారు.



.jpg)
.jpg)

.webp)



