Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అండర్ గ్రౌండ్ కరెంట్ షాక్ కొడుతుంది.!
posted on: Aug 12, 2026 2:30PM

వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి వ్యాఖ్యలు సర్వత్రా వైరల్ అవుతున్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గ్రాడ్యుయేట్.. ఎక్కడ చదివారొ, ఎలా పాస్ అయ్యారో అనే అనుమానాలు కలిగేలా ఆయన మాటలు ఉన్నాయి. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది.
అందులో భాగంగానే నగరంలో ఎక్కడా పైకి కరెంట్ వైర్లు, విద్యుత్ స్తంభాలు కనిపించకుండా, అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అంతర్జాతీయ నగరాల తరహాలో అమరావతి వీధుల కింద విద్యుత్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం డక్ట్ సిస్టమ్ను నిర్మించారు. ఈ సాంకేతిక అంశాలపై కనీస అవగాహన లేకుండా తాటిపర్తి చంద్రశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన పరువును నిండా తీయడమే కాకండా వైసీపీని నవ్వుల పాలు చేశాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు. మొత్తంగా వైసీపీయులు తమ అమరావతి వ్యతిరేకతను దాచుకోవడానికి ఇసుమంతైనా ప్రయత్నించకుండా ఇష్టారీతి వ్యాఖ్యలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఆ క్రమంలోనే అమరావతి అండర్ గ్రౌండ్ పవర్ గ్రిడ్ నెట్వర్క్ అంటే ఏమిటో కూడా తెలియని అజ్ణానంతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో తెగ ట్రోలింగ్ కు గురౌతున్నారు.
ఇటీవల మీడియాతో మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్ అమరావతిపై విమర్శలు గుప్పిస్తూ.. అడ్డంగా బుక్కయ్యారు. తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న పనులలో తప్పులను చూపడమే లక్ష్యంగా సాగిన ఆయన ప్రెస్ మీట్ లో దేశంలోనే ఫ్రీ పోల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో విద్యుత్ స్తంభాలను అండర్ గ్రౌండ్ లో పెడితే.. జనాలకు షాక్ కొట్టదా అంటూ ప్రశ్నించి, ఈ విధానాన్ని ఖండిస్తున్నానంటూ గంభీరమైన స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఒకవేళ ఈ విషయం మీద అవగాహన ఉండి ఉంటే తాటిపర్తి చంద్రశేఖర్ మరో విధంగా మాట్లాడి ఉంటే బాగుండేది. అలాకాకుండా కరెంటు పోల్స్ అండర్ గ్రౌండ్ లో పెడితే.. జనాలకు కరెంట్ షాక్ కొట్టదా.. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాను అంటూ దేన్ని ఎందుకు ఖండిస్తున్నారో కూడా తెలియకుండా గంభీరమైన స్టేట్ మెంట్ ఇచ్చేశారు. దీంతో నెటిజనులు తాటిపర్తి చంద్రశేఖర్ విజ్ణాన ప్రదర్శన అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
Tatiparthi Chandrasekhar, YSRCP MLA, Amaravati Underground Power Lines, Chandrababu Naidu, AP Politics, TeluguOne






