మావోలూ లొంగిపోండి.. మల్లోజుల పిలుపు

posted on: Nov 19, 2025 11:29AM

ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించడం పట్ల మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు మల్లోజుల వేణుగోపాల్ బుధవారం (నవంబర్ 19) విడుదల చేసిన ఓ వీడియోలో.. పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయనీ, దేశం కూడా ముందుకు సాగుతోందనీ పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మరణించడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. ఆయుధాలు వీడి లొంగిపోవడమే మేలని ఆయన మావోయిస్టులకు హితవు పలికారు. లొంగిపోవాలనుకునే మావోయిస్టులు తనను సంప్రదించాల్సిందిగా పేర్కొంటూ తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఈ వీడియోను గడ్చిరోలి పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...