చనిపోవడానికి అనుమతి ఇవ్వండి...రాష్ట్రపతికి లేఖ

posted on: Aug 19, 2016 5:27PM

 

తాను లంచం ఇచ్చుకోలేనని.. తాను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ ఓ వ్యక్తి ఏకంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశాడు. ఈఘటన నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నోయిడాలో డీకే గార్గ్ అనే యాభై నాలుగేళ్ల ఒక వ్యక్తి.. ఒక సంస్థ ఏర్పాటు నిమిత్తం నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ ఓసీ) ఇవ్వమని కోరితే సంబంధిత అధికారులు లంచం కోసం ఏళ్ల తరబడి తిప్పుతున్నారని, ఈ ఒత్తిడిని తాను తట్టుకోలేనని, ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించాని కోరుతూ లేఖ రాశారు. ఇక ఈ లేఖకు స్పందించిన జీఎన్ఐడీఏ సీఈఓ దీపక్ అగర్వాల్ మాత్రం గార్గ్ ఆరోపణలను ఖండించారు. తాను సరైన పత్రాలు ఇవ్వలేదని అందుకే ఆలస్యమైందని అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...