ఏపీలో 120 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
posted on: Nov 5, 2025 3:15PM

ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా లంచాలు, అవినీతి లావాదేవీలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయని సమాచారం. ప్రజలు న్యాయమైన సేవలు అందుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.






