Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సికింద్రాబాద్లో ఆర్టీసీ బస్సు కిందపడి విద్యార్థి దుర్మరణం
posted on: Jun 4, 2026 6:44PM
.webp)
సికింద్రాబాద్లోని వైఎంసీఏ ఫ్లైఓవర్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విశాల్ అనే బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం ప్రకారం, విశాల్ ఉదయం తన స్పోర్ట్స్ బైక్పై కాలేజీకి వెళ్లాడు. అనంతరం కాలేజీ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో సికింద్రాబాద్ వైఎంసీఏ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
బస్సు ఢీకొన్న తీవ్రతకు విశాల్ బైక్పై నుంచి ఎగిరి రోడ్డుపై పడిపోయాడు. దురదృ ష్టవశాత్తూ అతను బస్సు చక్రాల కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన క్షణాల్లోనే అతను ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. ప్రమాదం ఎలా జరిగింది, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణాల్లో విచారణ కొనసాగు తోంది.ప్రమాదం కారణంగా సికింద్రాబాద్–పంజాగుట్ట ప్రధాన రహదారిపై కొంతసేపు భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువ చ్చారు.యువ విద్యార్థి ఆకస్మిక మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరుగా విలపించసాగారు. "ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది" అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.






