యు.పి లో అసలు ప్రభుత్వముందా ..... రాహుల్

posted on: Oct 9, 2013 4:25PM

 

యు. పి లోని అలీగడ్ ర్యాలీలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యు.పి లోని ముజఫర్ నగర్ లో జరిగిన అల్లర్ల లో అనేక మంది హిదువులు,ముస్లిం లు చనిపోయారని,యువతకు ఉద్యోగాలు లేవని ఇదంతా చూస్తుంటే అసలిక్కడ ప్రభుత్వం పనిచేస్తోందా అని ప్రశ్నించారు. ఎస్. పి,బి.ఎస్.పి లు ఉత్తరప్రదేశ్ ను కాపాడలేక పోయాయని అన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వండి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందోరాహుల్ చూపిస్తానని అన్నారు. పేదరిక నిర్మూలనే కాంగ్రెస్ లక్ష్యం అని అన్నారు. యు.పి లో ఎవరు ఆకలితో చావకూడదు అంటూ ఆకలి చావుల నిర్మూలనకే కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత బిల్లును ప్రవేసపెట్టిందని అన్నారు. రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కోన్నారని,కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన భూసేకరణ బిల్లు ద్వారా రైతులకు సముచిత న్యాయం చేకూరుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు మిత్ర పక్షమైన అఖిలేష్ ప్రభుత్వం పైన అంత అకస్మాత్తుగా రాహుల్ ఎందుకు నిప్పులు చేరిగారో పలువురికి అర్ధం కాలేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...