మేదాంత ఆస్పత్రికి సోనమ్ వాంగ్చుక్ తరలింపు.!

posted on: Jul 22, 2026 10:14AM

 ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ పరిరక్షణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి  విషమంగా ఉంది. విద్యార్థుల హక్కుల కోసం, విద్యా రంగంలో సంస్కరణల కోసం గత 24 రోజులుగా  నిరశన దీక్ష సాగిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో  ఆయనను హర్యానా గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.  ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సోనమ్ వాంగ్చుక్ ను మేందాంత ఆస్పత్రికి తరలించారు. 

ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జూన్ చివరి వారంలో ఆయన నిరవధిక నిరశన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరాహార దీక్ష కారణంగా  ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మూడు రోజుల కిందట ఆయనను పోలీసులు బలవంతంగా  ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో కూడా ఆయన చికిత్స నిరాకరించి నిరశన కొనసాగించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో   ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం (జులై 21) అత్యవసర విచారణ జరిపింది. అనంతరం  ఆయన కోరిక మేరకు  హర్యానాలోని గురుగ్రామ్‌లోని  మేదాంత ఆసుపత్రికివెంటనే తరలించాలని ఆదేశించింది. 

వాంగ్‌చుక్‌కు నిరంతర, అత్యున్నత స్థాయి వైద్య పర్యవేక్షణ అత్యవసరమని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ వైద్యులతో పాటు ఆయన వ్యక్తిగత వైద్య బృందం కూడా కోర్టుకు తెలిపారు.   ఇలా ఉండగా ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్, నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించే వరకు తన  నిరశన విరమించేది లేదని సోనమ్ వాంగ్చుక్ స్పష్టం చేశారు. తనను మేదాంత ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అక్కడ కూడా నిరశన కొనసాగిస్తానని పేర్కొన్నారు. 

Delhi High Court order, Medanta Hospital Gurugram, Hunger strike 24 days, Sonam wangchuk

google-ad-img
    Related Sigment News
    • Loading...