చిక్కుల్లో స్మృతీ ఇరానీ

posted on: Mar 17, 2016 11:33AM


 

స్మృతీ ఇరానీ విద్యార్హతకు సంబంధించిన వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మానవవనరుల శాఖ కేంద్ర మంత్రిగా ఉన్న సృతీ ఇరానీ, ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లలో... వేర్వేరు సందర్బాలలో వేర్వేరు వివరాలను అందించారన్నది ప్రధాన ఆరోపణ. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తాను బి.ఎ చదివానని చెప్పిన స్మృతీ, 2014లో తన విద్యార్హత బీ.కాం అని పేర్కొన్నారు. ఈ ఆరోపణ మీద అహ్మెర్‌ ఖాన్‌ అనే ఓ ఫ్రీలాన్స్ రచయిత, దిల్లీ న్యాయస్థానంలో ఓ కేసుని కూడా దాఖలు చేశారు. కేసుని విచారిస్తున్నా న్యాయస్థానం, సంబంధిత పత్రాలను అందచేయాలంటూ... ఎన్నికల సంఘానికీ, స్మృతీ చదువుకున్నానని చెబుతున్న దిల్లీ విశ్వవిద్యాలయానికీ సూచించింది. మే 3న జరిగే తదుపరి విచారణలో, న్యాయస్థానం ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో కనుక స్మృతీ ఇరానీ దోషిగా తేలితే, చట్టప్రకారం అరు నెలల వరకూ కారాగార శిక్షను విధించే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...