బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.!

posted on: Aug 20, 2026 10:13AM

సిద్దిపేటలో బుధవారం (ఆగస్టు 19) ఆర్థరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డరు.  బంధువుల ఇంట్లో జరిగిన  ఓ కార్యక్రమానికి  వెళ్లి  తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.  దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు  తన భార్య భాగ్య, కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2)లతో కలిసి సిద్దిపేటలో జరిగిన తమ బంధువు దశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం తిరిగి వస్తుండగా, దుబ్బాక మండలం అప్పన్నపల్లి శివారులో  వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న   బావిలోకి  దూసుకెళ్ళింది.

సమాచారం అందుకున్న  పోలీసులు, ఫైర్ సిబ్బంది అర్ధరాత్రి వేళ సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ క్రేన్ సహాయంతో బావిలో మునిగిపోయిన కారును పైకి వెలికితీశారు.  అప్పటికే  కారులోని నలుగురూ మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఒక కుటుంబం మొత్తం రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన  బల్వంతాపూర్ గ్రామాన్ని శోకంలో ముంచేసింది.

Siddipet Car Accident, Dubbaka Road Accident, Car Falls into Well Medak, Telangana Crime News, Dandugula Raju Accident

google-ad-img
    Related Sigment News
    • Loading...