నిజం చూడండి.. చూసిన నిజం నమ్మండి.. నారా భువనేశ్వరి
posted on: Feb 20, 2026 9:16AM
.webp)
హెరిటేజ్ సంస్థ రైతుల సాధికారత కోసమే పని చేస్తున్నదని హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి అన్నారు. అత్యంత పారదర్శనతో గత 33 ఏళ్లుగా నిజాయితీగా పని చేస్తున్న తమ సంస్థ నాణ్యత విషయంలో ఎన్నడూ, ఎక్కడా రాజీ పడలేదని పేర్కొన్నారు.
ప్రతి ఇంటికీ తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ మూడు దశాబ్దాలకు పైగా ప్రతి పాడి రైతుకూ సాధికారత కల్పించడమే లక్ష్యంగా హెరిటేజ్ పని చేస్తోందన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో నారా భువనేశ్వరి షేర్ చేసిన పోస్టులో రూ.4 కోట్ల సంస్థగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగామనీ, అన్ని ఉత్పత్తులూ పాతిక నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే.. మీ ఇంటికి చేరుతున్నాయని చెప్పారు.
500కి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతులతో తాము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నామనీ పేర్కొన్న ఆమె తన పోస్టుకు జత చేసిన వీడియోను వీక్షించి నిజాన్ని చూడండన్న భువనేశ్వరి చూసిన నిజాన్నే నమ్మండి అని పేర్కొన్నారు.






