సచివాలయంలో సీమాంధ్రులు గెస్ట్ ఆర్టిస్టులే!

posted on: Jun 21, 2014 4:21PM

 

సచివాలయంలో బారికేడ్లు ఏర్పటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మధ్య అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రెండు రాష్ట్రాల సచివాలయాలు వేరు చేస్తూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల మధ్య ఘర్షణ నెలకొన్నాయి. అలాంటి పరిస్థితులు మరోసారి నెలకొనకుండా ఇలా బారికేడ్లు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇలా బారికేడ్లు ఏర్పాటు చేయడం మీద తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అనవసరపు కామెంట్లు చేశారు. సీమాంధ్రులు హైదరాబాద్లో ఉండేది తాత్కాలికమేనని, వారంతా గెస్టు ఆర్టిస్టులేనని, సీమాంధ్రులు హైదరాబాద్‌ని, సచివాలయాన్ని వదిలి వెళ్లిపోగానే సచివాలయంలో బారికేడ్లు తొలగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...