అమ్మ పేరిట మొక్క.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పవన్ వినూత్న కార్యక్రమం

posted on: Jun 5, 2026 12:23PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  శుక్రవారం (జూన్ 5) తన తల్లి అంజనాదేవికి అంకిత మిస్తూ ఓ అరుదైన మొక్క నాటారు.   పర్యావరణ పరిరక్షణ సందేశంతో పాటు ఒక భావోద్వేగపూరితమైన వ్యక్తిగత స్పర్శతో ఆయన చేసిన ఈ పని అందరినీ   ఆకట్టుకుంటోంది.

ఎన్టీఆర్ జిల్లా  మూలపాడు  బటర్ ఫ్లై పార్క్ సందర్శించిన పవన్ కళ్యాణ్... అక్కడ  అరుదైన తెల్ల పొనికి మొక్కను నాటారు. ప్రపంచప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మల తయారీకి ఈ తెల్ల పొనికి కర్రనే ఉపయోగిస్తారు. ఈ అరుదైన మొక్కను పవన్ కల్యాణ్ తన తల్లి అంజనా దేవికి అంకితం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనకు జన్మనిచ్చిన తల్లిపై ప్రేమతో, గౌరవంతో ప్రతి ఒక్కరూ   అమ్మ పేరిట కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా పచ్చదనాన్ని పెంచి, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...