కోల్ కతా డాక్టర్ హత్యాచార ఘటనలో దోషిగా సంజయ్ రాయ్

దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయిన  కోల్‌కతాలో ఆర్జీకర్‌ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచార కేసులో బంగాల్‌లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది.  సంజయ్ రాయ్ ను దోషిగా ఖరారు చేసింది గత ఏడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే.  ప్రధాన నిందితుడైన సివిక్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ను పోలీసులు  మరుసటి రోజే అరెస్టు చేశారు.  కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును దర్యాప్తు  సంస్థ అయిన సిబిఐ దర్యాప్తు చేసింది.సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్టు సిబిఐ తేల్చేసింది. సంజయ్ రాయ్ కు మరణ శిక్ష విధించాలని సిబిఐ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. డిఎన్ఏ రిపోర్టుతో అనేక ఆధారాలను సిబిఐ సేకరించింది. ఈ నెల 9న ఇరు పక్షాల వాదనలు విన్నారు. సంజయ్ రాయ్ కు జనవరి 20న కోర్టు  శిక్ష ఖరారు చేయనుంది.