అందుకే జంప్ చేసేసా మరి!

posted on: Jun 26, 2014 10:34AM

 

 

తెదేపాకు చెందిన ఇద్దరు తెలంగాణా యంయల్సీలు వెంకటేశ్వరులు, సలీం నిన్న తెరాస పార్టీలోకి దూకేశారు. రాజకీయ నేతలు పార్టీలు మారడం, వారిని అందుకు ఇతర పార్టీలు ప్రోత్సహించడం కొత్తేమీ కాదు. అయితే ఈ సనదర్భంగా సదరు నేతలు, పార్టీలు కూడా అటువంటి సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టేందుకు కొన్ని అందమయిన పడికట్టు పదాలు ప్రయోగిస్తుంటారు. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము పార్టీలు మారామని మిగిలిన యంయల్సీలు అందరూ చెప్పుకొంటే, నిన్న మొన్నటి వరకు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడుగా మెలిగిన సలీం మాత్రం అటువంటి బేషజాలకు పోకుండా తాను అధికారం కోసమే పార్టీ మారానని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పడం విశేషం. ఆయన నిన్న తెరాస కండువా కప్పుకొన్న తరువాత మీడియాతో మాట్లాడుతూ “మేము గత పదేళ్లుగా ప్రతిపక్షంలో కూర్చొని ఉన్నాము. ఇంకా మరో ఐదేళ్ళ పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి ఉంది. ఆ తరువాత కూడా మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. అందుకే తెరాసలో చేరుతున్నాను. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న రాష్ట్రాభివృద్ధి కారణంగా మళ్ళీ వచ్చే ఎన్నికలలోలో కూడా తెరసయే అధికారంలోకి వస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...