ఈ నెల 26న రైతు భరోసా నిధులు విడుదల!

posted on: Jun 18, 2026 9:20AM

తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం  తీపి కబురు అందించింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయానికి సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన ఖమ్మం జిల్లా మధిరలో   ఒక భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

గత యాసంగి పంట కాలంలో నిధుల పంపిణీ ఆలస్యం కావడం, కేవలం 5,653 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడంతో రైతాంగంలో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం..  ఈసారి వానాకాలం సాగు ముగియక ముందే, సరైన సమయంలో పెట్టుబడి సాయాన్ని అందించాలని   నిర్ణయించింది.   ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు నేరుగా చేతికి అందుతుండటంతో తెలంగాణ రైతాంగంలో  హర్షం వ్యక్తమౌతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...