Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్రికెట్ ఆడటానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..!
posted on: Jul 26, 2026 9:34AM
.webp)
కూకట్పల్లిలో టిప్పర్ ఢీకొని యువకుల దుర్మరణం..!
హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ స్కూటీని బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువ కుడు తీవ్రంగా గాయప డ్డాడు. మహేష్ (17), లక్ష్మీ తేజ (17)తో పాటు మరో యువకుడు ఆదివారం ఉదయం స్కూటీపై క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డుపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన టిప్పర్ లారీ వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
ఢీకొన్న వేగానికి స్కూటీ నుజ్జు నుజ్జు కాగా, మహేష్, లక్ష్మీ తేజ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో స్థాని కులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న కూకట్పల్లి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివే గమే ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ చేపట్టారు. అలాగే ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొనగా, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు






