Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆరునెలల్లో అగ్రీగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం.. సీఎం చంద్రబాబు
posted on: May 14, 2026 7:03PM
.webp)
ఏపీలోని లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. దశాబ్దంగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల కష్టాలకు ముగింపు పలికేలా.. వచ్చే ఆరు నెలల్లోనే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గురువారం (మే 14) జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ కమిటీ బాధితుల వివరాలను పరిశీలించి, సకాలంలో వారికి చెల్లింపులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. బాధితులకు అందాల్సిన ప్రతి పైసా అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అగ్రిగోల్డ్ దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో దాదాపు 19 లక్షల మందిని మోసంచేసింది వారిలో ఆంధ్రప్రదేశ్లోనే 11 లక్షల మందికి పైగా బాధితులు ఉన్నారు. గత ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చిందని, బాధితులకు న్యాయం చేయడంలో విఫలమైందన్న చంద్రబాబు గత పాలనలో కొంతమంది అధికారులు కూడా అగ్రిగోల్డ్ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయని, వాటిపై కూడా విచారణ జరగాలన్నారు.
సంస్థకు చెందిన ఆస్తులను వేగంగా వేలం వేయడం ద్వారా నిధులను సమీకరించి, బాధితుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో ఏజెంట్లు, బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న ఉదాహరణలు ఉన్నాయని, ఇకపై అటువంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. చట్టపరమైన చిక్కులను తొలగించి, బాధితుల క్లెయిమ్లను పరిష్కరించాలని ఆదేశించారు.


.webp)



